నిష్పక్షపాతంగా ఉండాల్సిన వారే, ఇంత పాక్షపాతమా?

Telugu Lo Computer
0


ఢిల్లీలో బుల్డోజర్ల ద్వారా ముస్లిం ఇళ్లను కూల్చేస్తున్నారని, ఈ సమయంలో కొందరు జర్నలిస్టులు విపరీత ధోరణితో మాట్లాడుతున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. అతి త్వరలో దేశంలో బుల్డోజర్ల కొరత రాబోతోందని, ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సి వస్తుందంటూ టీవీ యాంకర్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన వారే, ఇంత పాక్షికంగా ఉండటం ఏంటని ఫైర్ అయ్యారు. హిందీని జాతీయ భాష అంటూ వ్యాఖ్యానాలు వస్తున్న నేపథ్యంలో ఒమర్ స్పందించారు. భారత్ ఎంతో వైవిధ్యమైన దేశమని, అందరికీ స్థానం వుంటుందని పేర్కొన్నారు. భారతీయ కరెన్సీలో అన్ని భాషలకు స్థానం వుందని, దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అంటూ ఒమర్ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)