బీజేపీ నేత దారుణ హత్య

Telugu Lo Computer
0


ఢిల్లీలోని మయూర్ విహార్‌కు చెందిన బీజేపీ యువ నాయకుడు జీతు చౌదరిని దుండగులు కాల్చి చంపారు. ఆయన ఇంటి బయట బుధవారం రాత్రి 8 గంటల సమయంలో కాల్పులు జరిగినట్లు తెలుస్తుంది. గాజీపుర్​ ప్రాంతంలోని అతని నివాసం వద్దే గుర్తుతెలియని వ్యక్తులు బైక్​పై వచ్చి కాల్చి చంపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. దేశ రాజధానిలో.. అది కూడా ఆరు రౌండ్ల కాల్పులు జరపడం ఇప్పుడు దేశంలోనే సంచలనంగా మారింది. హత్య కాబడిన జీతూ చౌదరి మయూర్​ విహార్​ జిల్లా బీజేపీకు సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హత్య జరిగిన ఘటనాస్థలం నుంచి ఖాళీ క్యాట్రిడ్జులు సహా పలు కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి సీసీటీవీ ఫుటేజ్​ల ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. హంతకులను వీలైనంత త్వరగా అరెస్టు చేయాలని ఢిల్లీ పోలీసులను కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)