గోపాలపురం ఎమ్మెల్యేపై దాడికి యత్నం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జి.కొత్తపల్లిలో ఈ ఉదయం వైకాపా నాయకుడు గంజి ప్రసాద్‌ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వైకాపా నాయకుడి పరామర్శకు గోపాలపురం వైకాపా ఎమ్మెల్యే తలారి వెంకట్రావు వెళ్లారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేను పార్టీలోని మరో వర్గం అడ్డుకుంది. అనంతరం ఎమ్మెల్యేపై దాడికి యత్నించారు. దాడి ఘటనను అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జి.కొత్తపల్లిలో ఇరువర్గాల మధ్య ఆధిపత్యంలో గంజి ప్రసాద్‌ హత్య జరిగినట్లు సమాచారం. మరో వర్గానికి మద్దతు వల్లే హత్య జరిగిందంటూ ఎమ్మెల్యేపై దాడికి యత్నించినట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)