తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ మండలం గ్రామం న్యావనంది గ్రామం జగదాంబ తండాకు చెందిన యువ రైతు జేతూరం సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. రబీ సీజన్లో ప్రభుత్వం వరి సాగు వద్దనడంతో యువ రైతు పొద్దు తిరుగుడు పంట సాగు చేశాడు. అయితే నకిలీ విత్తనాలతో పంట దిగుబడి రాక నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశాడు. విషయం తెలిసిన వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని యువ రైతును కిందకు దించేందుకు ప్రయత్నిస్తున్నారు.
నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతు సెల్ టవర్ ఎక్కి హల్చల్
April 30, 2022
0
Tags