బెంగాల్లోని అసన్సోల్ లోక్సభ నియోజకవర్గం కోసం ఇవాళ ఉప ఎన్నిక జరుగుతున్నది. అయితే అక్కడ బీజేపీ అభ్యర్థిగా అగ్నిమిత్ర పౌల్ పోటీ చేస్తున్నారు. తన వాహనశ్రేణిలో ఓ బూత్ను పరిశీలించేందుకు వచ్చిన అగ్నిమిత్రపై దాడి జరిగింది. టీఎంసీ కార్యకర్తలు తనపై దాడి చేసినట్లు ఆమె ఆరోపించారు. అగ్నిమిత్ర వాహనంపై రాళ్లు రువ్వారు. కర్రలతో తమ సెక్యూర్టీపై టీఎంసీ కార్యకర్తలు దాడి చేసినట్లు ఆమె ఆరోపించారు. అసన్సోల్లో తామే గెలవబోతున్నట్లు ఆమె చెప్పారు.
బెంగాల్ ఉప ఎన్నికలో ఘర్షణ
April 12, 2022
0