హైదరాబాద్‌లో సీరమ్స్ టీకాల తయారీ కేంద్రం

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లో భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్(బీవీఎస్) సంస్థ పెట్టుబడులు పెట్టనుంది. జీనోమ్ వ్యాలీలో రూ. 200 కోట్లతో టీకాల తయారీ కేంద్రాన్ని బీఎస్‌వీ గ్లోబస్ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు ఆ సంస్థ ఎండీ సంజీవ్ నావన్ గుల్‌, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసి ప్రకటించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినందుకు ఎండీ సంజీవ్ నావన్ గుల్‌కు కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ చర్యతో ప్రపంచంలోనే వ్యాక్సిన్ హబ్‌గా హైదరాబాద్ నగరం తన స్థానాన్ని సుస్థిరం చేసుకుందని కేటీఆర్ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)