కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్ పై పార్లమెంట్ ఉభయ సభల్లో టిఆర్ఎస్ ఎంపిల సభాహక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేశారు. గత శుక్రవారం రాజ్యసభలో మంత్రి పారా బాయిల్డ్ రైస్ ఎగుమతులు విషయంలో సభను తప్పుదోవ పట్టించారని రాజ్య సభ చైర్మన్ వెంకయ్య నాయుడుకు నోటీసులు ఇచ్చారు. డబ్ల్యూటిఒ ఆంక్షల నేపథ్యంలో పారా బాయిల్డ్ రైస్ను విదేశాలకు ఎగుమతి చేయడంలేదని, కేంద్ర మంత్రి పీయూష్ చేసిన వ్యాఖ్యలు అబద్దమన్నారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో పీయూష్ గోయల్ సమాధానం పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించేలా ఉందని పేర్కొన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ లో మిలియన్ టన్నుల పారా బాయిల్డ్ రైస్ విదేశాలకు ఎగుమతి చేసినట్లు ఉందని ఎంపిలు వెల్లడించారు. దీంతో సభను తప్పుదోవ పట్టించారని కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా టిఆర్ఎస్ ఎంపిలు సురేష్ రెడ్డి, లింగయ్య యాదవ్ రాజ్యసభలోని 187 నిబంధన కింద "ప్రివేలేజ్ మోషన్ నోటిస్" ఇచ్చారు. లిఖిత పూర్వకంగా ఇచ్చిన సమాధానంలో నోటిస్ లో కేంద్ర మంత్రి సభను తప్పుదోవ పట్టించారని పేర్కొన్నారు.
పీయూష్ పై ప్రివేలేజ్ మోషన్ నోటీస్
April 04, 2022
0