తమిళనాడులో అఘాయిత్యం !

Telugu Lo Computer
0


తమిళనాడులోని దిండిగల్ జిల్లా నాథమ్ గ్రామ సమీపంలో అంజలై అనే 22 ఏళ్ల మహిళ శివకుమార్‌ అనే దినసరి కూలిని పెళ్లి చేసుకుంది. వారిది ఉమ్మడి కుటుంబం. శివకుమార్‌ సోదరుడు కరుప్పయ్య అంజలై పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా చిత్రహింసలకు గురిచేసేవాడు. అయితే ఒకరోజు శివకుమార్‌ పనికి వెళ్లిపోగా ఆమె తన కూతురుతో కలిసి గొర్రెలను మేపడానికి వెళ్లింది. ఇదే అదునుగా చేసుకుని కురప్పయ్య ఆమెను వెంబడించి వేధించడం మొదలు పెట్టాడు. ఆమె భయంతో సాయం కోసం కేకలు వేయడం మొదలు పెట్టింది. దీంతో అతను అంజలై, అమె బిడ్డను నరికి చంపి, సజీవ దహనం చేశాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అతనికి దేహశుద్ధి చేశారు. బాధితురాలి భర్త శివకుమార్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కురప్పయ్యను అదుపులోకి తీసుకుని ఆరెస్టు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)