తెలంగాణలోని బాన్సువాడ పట్టణ శివారులో నివసించే ఓ కుటుంబంలో నలుగురు సభ్యులు ఉన్నారు. ఏడాదిన్నర క్రితం కరోనాతో తల్లి మృతి చెందింది. తండ్రికి కళ్లు కనిపించవు. ఈ నేపథ్యంలో మైనర్ అయిన చెల్లితో సోదరుడు ఏడాదిగా శారీరక సంబంధం పెట్టుకున్నాడు. గురువారం బాలికకు రక్తస్రావం కావడంతో బాన్సువాడ ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు మైనర్ ఏడు నెలల గర్భవతి అని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. కడుపులోనే ఏడు నెలల శిశువు మృతి చెందడంతో శస్త్రచికిత్స చేసి తొలగించారు. ప్రస్తుతం బాలిక క్షేమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు బాన్సువాడ డీఎస్పీ జైపాల్రెడ్డి తెలిపారు.
చెల్లిని గర్భవతిని చేసిన సోదరుడు
April 02, 2022
0