నేడు ప్రధాని మోదీతో రష్యా మంత్రి భేటీ

Telugu Lo Computer
0


ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ మంత్రి జై శంకర్‌తో  రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఈరోజు సమావేశం కానున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలు, వ్యాపార కార్యకలాపాలపై వారు చర్చించనున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఆరంభమైన తర్వాత ఆ దేశానికి చెందిన కీలక మంత్రి భారత్‌ను సందర్శించడం ప్రాధాన్యత సంతరించుకున్నది. చైనా, బ్రిటన్‌ విదేశాంగ మంత్రుల భారత్‌ పర్యటన తర్వాత తాజాగా రష్యా విదేశాంగ మంత్రి కూడా రావడం కీలకంగా మారింది. మరోవైపు.. చైనాతో చర్చలు జరిపిన మరునాడే భారత్‌కు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ వచ్చారు. బుధవారం చైనాకు వెళ్లి ఆ దేశ విదేశాంగ మంత్రిలో చర్చలు జరిపిన సెర్గీ లావ్రోవ్, అనంతరం నేరుగా భారత్‌కు వచ్చారు. ఫిబ్రవరి 24న యుక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత శాంతి చర్చల ప్రతిపాదన కోసం ఆయన తొలుత టర్కీలో పర్యటించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు పలు ఆంక్షలు విధించాయి. అయితే భారత్‌ మాత్రం రష్యా నుంచి చమురుతో పాటు పామాయిల్‌ వంటి అనేక వస్తువుల కొనుగోళ్లను కొనసాగిస్తున్నది. దీంతో అమెరికాతో పాటు ఆస్ట్రేలియా కూడా భారత్‌ తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)