రూ.929 కోట్ల ఉపాధి హామీ వేతనాల విడుదల

Telugu Lo Computer
0

 

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులు రూ.929 కోట్లను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. 6 కోట్ల కుటుంబాలకు పైగా ఈ ఉపాధి హామీ లభించనున్న ఈ పథకంలో నమోదైన డేటాలో దాదాపు మొత్తం 99.63 శాతం మందికి ఉపాధి కల్పించబడుతుంది. ఈ ఉపాది హామీ పథకంలో పని చేస్తున్న వేతనదారులకు తక్షణ వేతన చెల్లింపుల నిమిత్తం 2022-23 ఆర్ధిక సంవత్సరంలో మొదటి విడతలో భాగంగా తొలిసారి ఈ నిధులను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ విడుదల చేసింది. విడతల వారీగా, రోజువారీ వేతన ఎఫ్.టి.ఓల అప్ లోడ్ ఆధారంగా నేరుగా వేతనదారుల ఖాతాలకు ఈ నిధులు జమ కానుంది. గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం కేటాయించే నిధుల్లో ప్రతి ఏటా 18 శాతానికి పైగా పెరుగుదల ఉంటుందని గత ఏడాది అక్టోబర్ నెలలో కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇప్పుడు ఇప్పుడు విడుదల చేసింది తొలి విడత నిధులు మాత్రమే కాగా.. మొత్తం నిధుల విడుదలైతే కానీ ఈ ఏడాది ఎంతమేర పెరుగుదల ఉందన్నది తెలుస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)