బతికుండగానే శ్మశానవాటికకు...!

Telugu Lo Computer
0


తెలంగాణలోని ములుగు జిల్లా వెంకటాపూర్‌లో బుధవారం చోటుచేసుకుంది. వడ్రంగి పని చేసే కేశోజు లక్ష్మణచారి (30) తల్లిదండ్రులు సోమయ్య, సరోజినితో కలిసి 20 ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఆరు నెలల క్రితం ప్రమాదవశాత్తు లక్ష్మణచారి వెన్నెముకకు గాయమై నడవలేని స్థితికి చేరుకున్నారు. ఆసుపత్రిలో ఉంచి వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. మంగళవారం సాయంత్రం అతని పరిస్థితి విషమించడంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లాలని చెప్పారు. కొన ఊపిరితో ఉన్న ఆయనను కుటుంబ సభ్యులు తీసుకురాగా ఇంటి యజమాని అడ్డుకున్నారు. చేసేది లేక లక్ష్మణాచారి కుటుంబ సభ్యులు అతన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లారు. బుధవారం ఉదయం ఆయన మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై రాధిక, సర్పంచి అశోక్‌, పంచాయతీ సిబ్బంది సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)