దేశంలో 795 కొత్త కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 795 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1286 మంది బాధితులు కోలుకున్నారు. భారత్ లో ప్రస్తుతం 12,054 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కొత్త కేసులును కలుపుకుని మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 4,30,29,839కి పెరిగింది. 58 తాజా మరణాలతో మరణాల సంఖ్య 5,21,416కి చేరింది. భారత్ లో కోవిడ్ రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. కరోనా వైరస్ నుండి కోలుకున్న వారి సంఖ్య 4,24,96,369కి పెరిగింది. దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 1,84,70,33,081 మందికి కోవిడ్ టీకాలు పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. ఇక గడిచిన 24 గంటల్లో 16,17,688 మందికి కరోనా టీకాలు వేసినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)