ఇంటి పన్ను కడితే 5 శాతం డిస్కౌంట్‌

Telugu Lo Computer
0


ఆంధ్ర ప్రదేశ్‌ లో మున్సిపాలిటీలు, నగర పాలక, నగర పంచాయతీలలో ఆస్తి పన్ను ను ఈ మాసం చివరలో చెల్లిస్తే.. 5 శాతం డిస్కౌంట్‌ ఇవ్వాలని  ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మొత్తం తమ ఆస్తి పన్నును ఒకే సారి చెల్లిస్తేనే.. ఈ రాయితీ వర్తిస్తుందని పురపాలక శాఖ ఉత్తర్వులలో పేర్కొంది. ఈ మేరకు తదుపరి చర్యలు కూడా తీసుకోవాలని ఆయా మున్సిపల్‌ కమిషనర్లను ఆదేశించింది. పాత బకాయిలను మార్చి.. నెలాఖరులోగా చెల్లించాలని సూచనలు చేసింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు పన్ను వసూలు మొదలు పెట్టారు. కొన్ని చోట్ల దీనిపై తీవ్ర వ్యతిరేకత కూడా వచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)