ముంబైలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. రూ.24 కోట్ల విలువైన 3 వేల 9 వందల 80 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు ముంబై ఎన్సీబీ అధికారులు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అక్రమంగా డ్రగ్స్ తరలిస్తున్న దక్షిణాఫ్రికా వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. ట్రాలీ సూట్ కేసు లో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ ను గుర్తించి సీజ్ చేశారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రూ.24 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
April 14, 2022
0