సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ అమృత్ సర్ స్వర్ణదేవాలయాన్ని సందర్శించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అమృత్ సర్ సందర్శించిన ఆయన కుటుంబ సమేతంగా స్వర్ణ దేవాలయానికి వెళ్లారు. గోల్డెన్ టెంపుల్ జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ సర్ణదేవాలయానికి రావాలన్న తన జీవితకాల కోరిక నెరవేరిందన్నారు. ప్రార్థనల అనంతరం ఎన్వీ రమణ కుటుంబ సభ్యులను ఆలయ అధికారులు సన్మానించారు.
స్వర్ణదేవాలయాన్ని సందర్శించిన చీఫ్ జస్టిస్
April 14, 2022
0