చైనాలో మళ్లీ కొవిడ్ కలవరం సృష్టిస్తోంది. చైనాలో రోజుకు 20 వేల ఒమైక్రాన్ వేరియంట్ కేసులు వెలుగుచూస్తుండటం చైనీయులను ఆందోళనకు గురిచేస్తోంది. చైనాలోని షాంఘై నగరంలో లాక్డౌన్ విధించినా కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. చైనా మార్చి నెల వరకు అంతర్జాతీయ ప్రయాణాలపై కఠినమైన ఆంక్షలు విధించి రోజువారీ కరోనా కేసుల సంఖ్యను కట్టడి చేసింది.షాంఘై నగరంలో ఒమైక్రాన్ వేరియంట్ కేసులు అధికంగా వెలుగుచూశాయి. చైనాలో బుధవారం 20,472 కేసులు నమోదయ్యాయి. ఎలాంటి లక్షణాలు లేని కరోనా కేసులు నమోదవుతున్నాయి.కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో చైనాలో పలు పరిశ్రమలను మూసివేశారు. కరోనా వ్యాప్తి వల్ల చైనాలో ఆర్థిక సమస్యలు ఏర్పడ్డాయి.
చైనాలో రోజుకు 20 వేల కేసుల నమోదు
April 06, 2022
0