దేశంలో కొత్తగా 1033 కేసులు నమోదు !

Telugu Lo Computer
0

దేశంలో  గడిచిన 24 గంటల్లో 4,82,039 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా 1,033 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు గురువారం ఉదయం విడుదల చేసిన బులిటెన్‌లో కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,30,31,958కి చేరింది. నిన్న 43 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 5,21,530కి చేరింది. 1,222 మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఈ మహమ్మారిని జయించిన వారి సంఖ్య 4,24,98,789కి చేరింది. ప్రస్తుతం దేశంలో 11,639 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక రికవరీ రేటు 98.76, రోజువారి పాజిటివిటీ రేటు కూడా 0.21 శాతంగా నమోదు అయింది. దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)