దేశంలో కొత్తగా 1007 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,39,023కు చేరాయి. ఇందులో 4,25,06,228 మంది బాధితులు వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 11,058 మంది చికిత్స పొందుతుండగా, 5,21,737 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో 818 మంది కరోనా నుంచి బయటపడగా, ఒకరు మృతి చెందారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.23 శాతంగా ఉందని, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 0.03 శాతమని, రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటివరకు 83.03 కోట్ల మందికి కరోనా పరీక్ష చేశామని, ఇందులో బుధవారం ఒక్కరోజే 4,34,877 మందికి టెస్టులు చేశామని పేర్కొన్నది.
దేశంలో కొత్తగా 1007 కరోనా కేసులు
April 14, 2022
0