పోరస్ రసాయన పరిశ్రమ పేలుడులో ఆరుగురి మృతి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం సమీపంలోని పోరస్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కార్మికులు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాద సమయంలో అక్కడ 150 మంది కార్మికులు పనిచేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. వారిలో ఆరుగురు మంటల్లో చిక్కుకుని మరణించారు. మరో 40 మందిని సమీపంలోని నూజివీడు, ఏలూరు, విజయవాడ ఆస్పత్రులకు తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుసుతుంది. యూనిట్ 4లో బ్లాస్ట్ జరిగి మంటలు చెలరేగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అధిక ఒత్తిడితో ఓవర్ హీట్ మూలంగా రియాక్టర్ పేలి ఉంటుందని అంచనా వేస్తున్నారు. సమీపంలో రెండో రియాక్టర్ కూడా పేలిపోతుందేమోనని స్థానికులు కూడా ఆందోళన వ్యక్తంచేశారు. పోలీసులు, ఫైర్ సిబ్బంది సకాలంలో అక్కడికి చేరుకుని మంటలు అదుపు చేశారు. దాంతో మంటలు మరింతగా వ్యాపించకుండా నియంత్రించగలిగతారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని ముసునూరు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)