పలాస అమ్మాయికి అమెజాన్ లో ఉద్యోగం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన స్నేహ కిరణ్ ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లో ఉద్యోగానికి ఎంపికయింది. రూ.44 లక్షల వార్షిక వేతనంతో ఈ ఉద్యోగానికి ఎంపికయిందామె. తండ్రి సింహాచలం స్థానిక జీడిపప్పు ఫ్యాక్టరీలో పని చేస్తుండగా, తల్లి సుభాషిణి గృహిణి. స్నేహ ప్రస్తుతం విశాఖపట్టణం లోని ప్రైవేట్ కాలేజీలో బీటెక్, సీఎస్‌ఈ చివరి సంవత్సరం చదువుతోంది. గణితంపై చిన్నప్పటి నుంచే పట్టు సంపాదించిన స్నేహ కరోనా సమయంలో ఆన్‌లైన్ ద్వారా కోడింగ్ నేర్చుకుంది. స్నేహితులతో కలిసి గ్రూప్ డిస్కషన్ చేసేది. అమెజాన్‌ ఇంటర్వ్యూ సందర్భంగా ఇవన్నీ తనకు కలిసొచ్చాయని స్నేహ వెల్లడించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)