రిటైర్ మెంట్ ప్రకటించిన యాష్లే బార్టీ!

Telugu Lo Computer
0


యాష్లే బార్టీ తన అంతర్జాతీయ టెన్నిస్ కు గుడ్ బై చెప్పింది. 25 సంవత్సరాలకే టెన్నిస్ కు గుడ్ బై చెబుతూ సంచలన ప్రకటన చేసింది యాష్లే బార్టి. 41 సంవత్సరాల తర్వాత వింబుల్డన్ గెలిచిన ఆస్ట్రేలియా క్రీడాకారిణిగా యాష్లే బార్టీ గత సంవత్సరం రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. “నేను టెన్నిస్ నుండి రిటైర్మెంట్ ప్రకటించడం చాలా కష్టం గా ఉంది. భావోద్వేగంతో నిండి ఉన్నాను. ఈ టెన్నిస్‌ నాకు అందించిన ప్రతి దానికీ నేను చాలా కృతజ్ఞుడను. గర్వంగా, సంతృప్తిగా భావిస్తున్నాను. నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు, మేము కలిసి సృష్టించిన జీవితకాల జ్ఞాపకాలకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను.” అంటూ ఈ మేరకు బార్టీ ఓ పోస్టు కూడా చేసింది. 2021 ఏడాదిని నెంబర్‌ వన్‌ ర్యాంక్‌ తో ముగించిన యాష్కే బార్టీ.. స్టెఫీ గ్రాఫ్‌, మార్టినా నవ్రతిలోవా, సెరెనా విలియమ్స్, క్రిస్‌ ఎవర్ట్‌ సరసన నిలిచింది.

Post a Comment

0Comments

Post a Comment (0)