సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు సీజేఐ కోసం దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి, ఆలయ ఈవో కేఎస్ జవహర్రెడ్డిలు ఆలయ ప్రధాన ద్వారం వద్ద సీజేఐకు స్వాగతం పలికారు. తిరుమలలో శుభ్రత, సుందరీకరణ చాలా బాగున్నాయని, భక్తుల కోసం కల్పించిన సౌకర్యాలు భేష్ అన్నారు సీజేఐ ఎన్వీ రమణ. రెండేళ్ల తర్వాత రోజూ వేలాదిమంది సామాన్య భక్తులకు సర్వదర్శనం కల్పించడం సంతోషకరమన్నారాయన.
శ్రీవారి సన్నిధిలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
March 06, 2022
0