దేశంలో 5,476 కరోనా కొత్త కేసులు నమోదు!

Telugu Lo Computer
0


దేశంలో కరోనా ఉధృతి తగ్గుముఖం పట్టింది. నిన్న 5,476 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా వల్ల 158 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. కరోనా నుంచి 9,754 మంది కోలుకున్నారని పేర్కొంది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటోన్న వారి సంఖ్య 59,442గా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు కరోనా నుంచి మొత్తం కోలుకున్నవారి సంఖ్య 4,23,88,475కు పెరిగింది. దేశవ్యాప్తంగా మొత్తం 178.83 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతూనే వుంది. 


Post a Comment

0Comments

Post a Comment (0)