హర్యానా సీఎం ఇంటిపై రాళ్లు రువ్విన యువకులు

Telugu Lo Computer
0


హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ఇంటిపై యువకులు రాళ్ల దాడిచేశారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో కర్నాల్‌ జిల్లా ప్రేమ్‌ నగర్‌లో ఉన్నఖట్టర్‌ నివాసంపై గుర్తుతెలియని యువకులు రాళ్లు రువ్వారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. దాడి నేపథ్యంలో సీఎం ఇంటివద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. బైకులపై ఐదుగురు యువకులు వచ్చారు. అప్పటికే తెచ్చుకున్న రాళ్లను ఇంటిపైకి విసిరారు. అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డులను చూసి పారిపోయారని పోలీసులు తెలిపారు. ఈ దాడిలో ఎవరిగా గాయాలు కాలేదని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. దాడికి పాల్పడినవారికోసం గాలిస్తున్నామని వెల్లడించారు. సమీపంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)