ఆంధ్రప్రదేశ్ లో త్వరలో మిల్లెట్ మిషన్ పాలసీ ని తీసుకువస్తామని దీని ద్వారా చిరుధాన్యాల సాగుకు మరింత ఊతమిస్తామని మంత్రి కన్నబాబు ప్రకటన చేశారు. సీఎం వైఎస్ జగన్ ఆవిష్కరించిన రైతు భరోసా కేంద్రం వ్యవస్థ ఒక విప్లవమని, దీని ద్వారా ప్రతి గ్రామంలోనూ రైతుకు సొంత కార్యాలయం ఉందనే ధీమ కలిగిందని చెప్పారు. టీడీపీ సభ్యులు ఈ స్థాయిలో దిగజారిపోతారని అస్సలు ఊహించలేదని టీడీపీ సభ్యులు బిచ్చగాళ్లలా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. పెద్దల సభలో చిల్లర గలాటా చేస్తున్నారని, శాసనమండలి ఛైర్మన్పట్ల లోకేష్ అమర్యాదగా ప్రవర్తించారన్నారు. చంద్రబాబు బయట నుంచి సభను కంట్రోల్ చేయాలని చూస్తున్నారన్నారని కురసాల కన్నబాబు అన్నారు
త్వరలో 'మిల్లెట్ మిషన్ పాలసీ'
March 25, 2022
0