ఎలక్ట్రిసిటీ డీఈ ఆస్తుల విలువ రూ. 100 కోట్ల పైనే!

Telugu Lo Computer
0


తెలంగాణలోని నల్గొండ జిల్లా వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మిర్యాలగూడలో ఎలక్ట్రిసిటీ డీఈ మురళీధర్రెడ్డి ఏసిబికి చిక్కిన కేసులో నల్గొండ, నడిగూడెం, హైదరాబాద్​లలో తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులకు కోట్లాది రూపాయల విలువైన భూముల కాగితాలు, తోటల వివరాలు, ఆస్తుల దస్తావేజులతో పాటుగా బంగారు, వెండి, డైమండ్ ఆభరణాలు కనిపించాయి. వాటన్నింటినీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ. 100 కోట్లకు పైగా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మురళీధర్ రెడ్డి మిర్యాలగూడలో టెక్నికల్ ఏఈగా పనిచేయడంతో పాటుగా, హాలియాలో ఏఈగా, దేవరకొండ ఏడీఈగా, చౌటుప్పల్ డీఈగా పనిచేశారు. దేవరకొండకు చెందిన శివకుమార్ పేరిట బినామీ లైసెన్స్ తెరిచి ఆయన పనిచేసిన ప్రతి చోటా రూ. కోట్లతో పనులు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. లీవ్ రెగ్యులరైజ్ చేసేందుకు లైన్ మెన్ నుంచి లంచం తీసుకుంటూ విద్యుత్ శాఖ డీఈ, యూడీసీ, జేవోలు రెడ్ హ్యాండెడ్​గా పట్టుబడ్డారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ట్రాన్స్ కో కార్యాలయంలో మంగళవారం జరిగింది. మిర్యాలగూడ లోని రెడ్డికాలనీ లైన్ మెన్ గుంటూరు శ్రీనివాస్ పని చేస్తున్నాడు. తన కుమారుడి అనారోగ్యం కారణంగా 2004 నవంబరు 23 నుంచి సెలవుపై వెళ్లాడు. తిరిగి 2005 నవంబరు 14న పాలకవీడు లైన్​మెన్​గా విధుల్లో చేరాడు. అయితే 350 సెలవు రోజుల లీవ్ రెగ్యులరైజేషన్తోపాటు, ఇంక్రిమెంట్లు, లీవ్ పీరియడ్కు సంబంధించిన రూ.7 లక్షల ఎరియర్స్ ఇస్తూ పదోన్నతి కల్పించాలని శ్రీనివాస్ డీఈకి దరఖాస్తు చేసుకున్నాడు. ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు డీఈ మురళీధర్రెడ్డి, యూడీసీ లతీఫ్, జేవో దామోదర్లు రూ.7 లక్షల లంచం డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని మూడు విడతలుగా చెల్లిస్తేనే ఫైల్ కదులుతుందని తెగేసి చెప్పారు అధికారులు. దీంతో శ్రీనివాస్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మొదటి విడతగా రూ.2 లక్షల నగదుతో డీఈ చాంబర్ కు వెళ్లాడు. అక్కడ మురళీధర్రెడ్డి. లతీఫ్, దామోదర్లతో కలిసి డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)