ఉత్కంఠభరిత మ్యాచ్ లో పాకిస్థాన్‌ పై దక్షిణాఫ్రికా విజయం

Telugu Lo Computer
0


ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను ఓడించి దక్షిణాఫ్రికా తన విజయ పరంపరను కొనసాగించింది. పాకిస్థాన్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది. ఈ టోర్నీలో పాకిస్తాన్ టీంకు ఇది వరుసగా మూడో ఓటమి. దక్షిణాఫ్రికా కంటే ముందు పాకిస్థాన్ జట్టు భారత్, ఆస్ట్రేలియాల చేతిలో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మరోవైపు దక్షిణాఫ్రికా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. అంతకుముందు బంగ్లాదేశ్‌పై 32 పరుగుల తేడాతో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా టీం పాక్ ముందు 224 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీనికి బదులుగా పాక్ జట్టు కేవలం 217 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఈ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో పాక్ జట్టు ఘోర పరాజయం పాలైంది. చివరి ఓవర్లో పాక్ విజయానికి 10 పరుగులు మాత్రమే కావాల్సి ఉండగా, చేతిలో 2 వికెట్లు మిగిలి ఉన్నాయి. దక్షిణాఫ్రికా బౌలింగ్‌ బాధ్యతలను షబ్నిమ్‌ ఇస్మాయిల్‌ తీసుకుంది. తొలి బంతికే 2 పరుగులు వచ్చాయి. దీంతో మ్యాచ్ మరింత ఉత్కంఠభరితంగా సాగింది. కానీ, తర్వాతి బంతికే ఇస్మాయిల్ పాకిస్థాన్‌కు 9వ దెబ్బ తీశింది. డయానా పెవిలియన్‌కు చేరుకుంది. దీని తర్వాత, తర్వాతి బంతికి మళ్లీ సింగిల్ వచ్చింది. ఇక చివరి 3 బంతుల్లో పాకిస్థాన్‌కు 7 పరుగులు కావాలి. లక్ష్యం చేరుకునేట్లు కనిపించింది. దక్షిణాఫ్రికా బౌలర్ తన సత్తా చాటి మరో వికెట్ పడగొట్టి విజయం సొంతం చేసుకుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)