వివాహేతర సంబంధం ప్రాణం తీసింది!

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్ బుక్కపట్నం మండలం గశికవారిపల్లికి చెందిన బలపనూరు రామాంజనేయులు (55) అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో 20 సంవత్సరాలుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో పిల్లలు పెద్దవాళ్లయ్యారని, వివాహేతర సంబంధం కొనసాగించడం ఇబ్బందికరంగా ఉందంటూ ఐదేళ్లుగా ఆ మహిళ దూరంగా ఉంటూ వస్తోంది. ఈ నెల 6న రామాంజనేయులు ఆమె ఇంటివద్దకెళ్లి ఒత్తిడి చేశాడు. ఆమె అంగీకరించకపోవడంతో గొడవ పడి చితక్కొట్టాడు. విషయం తెలుసుకున్న మహిళ సోదరుడు రమేష్, మరిది ధనుంజయ, కుమారుడు రవి అదే రోజు ముదిగుబ్బ నుంచి వచ్చి రామాంజనేయులుపై రోకలితో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన రామాంజినేయులు కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఘటనకు సంబంధించి దాడి చేసిన రవి, ధనుంజయ, రమేష్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)