తోటి టీచర్ ని నమ్మించి అత్యాచారం!

Telugu Lo Computer
0


తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలోని అంకన్న గూడెం పాఠశాలలో బాణోత్ కిశోర్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఆయన భార్య కూడా ఉపాధ్యాయురాలి గానే పని చేస్తుంది. వీరు ఖమ్మంలో నివాసం ఉంటున్నారు. కిశోర్ పని చేస్తున్న మండలంలోనే ఒక ఉపాధ్యాయురాలు పని చేస్తూ ఖమ్మంలోనే నివాసం ఉంటుంది. ఆ ఉపాధ్యాయురాలు ప్రతి రోజు రైలు ప్రయాణం ద్వారా.. పాఠశాలకు వెళ్తుంది. ప్రస్తుతం పాఠశాలలకు ఒంటి పూట నడుస్తుంది. దీంతో ఆ ఉపాధ్యాయురాలు మధ్యాహ్నమే ఇంటికి వెళ్తుంది. కాగా కిశోర్ తన భార్య కూడా కారులోనే వస్తుందని నమ్మించి ఆ ఉపాధ్యాయురాలును కారు ఎక్కించు కున్నాడు. కొంత దూరం వెళ్లాక ఆ ఉపాధ్యాయురాలిని బెదిరించి సెల్ ఫోన్ లాక్కుని అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే భర్త, పిల్లలను చంపెస్తానని బెదిరించాడు. బాధితురాలు తన భర్తతో జరిగిన విషయం చెప్పి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగ నిందితుడు కిశోర్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడని.. త్వరలోనే అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)