దేశంలో 1,938 కరోనా కొత్త కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో కరోనా కట్టడిలో ఉంది. కొద్దిరోజులుగా రెండు వేలకు దిగువనే నమోదవుతోన్న కొత్త కేసుల్లో రెండు రోజులుగా స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. నిన్న6.6 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు చేయ్యగా1,938 కొత్త కేసులొచ్చాయి. ముందురోజు ఆ సంఖ్య 1,778గా ఉంది. ప్రస్తుతం రోజూవారీ పాజిటివిటీ రేటు 0.29 శాతానికి క్షీణించింది. 24 గంటల వ్యవధిలో 67 మరణాలు సంభవించాయి. ఈ రెండేళ్లలో 4.30 కోట్ల కేసులు రాగా.. 5.16 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. క్రియాశీల కేసులు 22,427కి తగ్గాయి. మొత్తం కేసుల్లో ఆ వాటా 0.05 శాతానికి పడిపోయింది. నిన్న 2,531 మంది కోలుకోగా.. ఇప్పటి వరకూ 4.24 కోట్ల మంది వైరస్‌ను జయించారు. రికవరీ రేటు 98.75 శాతానికి పెరిగింది. నిన్న 31.8 లక్షల మంది టీకా తీసుకోగా.. మొత్తంగా పంపిణీ అయిన డోసుల సంఖ్య 182 కోట్ల మార్కును దాటింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)