ఆదివారం జరిగిన ఐపీఎల్ టీ20 టోర్నీలో భాగంగా దిల్లీతో ఆడిన మ్యాచ్లో ముంబయి కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ జరిమానా పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా రూ.12 లక్షలు జరిమానా విధించినట్లు నిర్వాహకులు చెప్పారు. దీంతో ఈ సీజన్లో స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా పడిన తొలి కెప్టెన్గా రోహిత్ నిలిచాడు. తొలుత ముంబయి టాస్ ఓడి బ్యాటింగ్ చేయగా నిర్ణీత 20 ఓవర్లలో 177/5 స్కోర్ సాధించింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ (81; 48 బంతుల్లో 11×4, 2×6) దంచికొట్టాడు. అనంతరం ఢిల్లీ 18.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. లిలిత్ యాదవ్ (48 నాటౌట్; 38 బంతుల్లో 4×4, 2×6), అక్షర్ పటేల్ (38 నాటౌట్; 17 బంతుల్లో 2×4, 3×6) రాణించి తమ జట్టుకు విజయాన్ని అందించారు. రెండో ఇన్నింగ్స్లో నిర్దిష్ట సమయంలోపు ముంబయి బౌలింగ్ కోటా పూర్తి చేయకపోవడంతో కెప్టెన్ రోహిత్ కు ఈ జరిమానా విధించారు. ఇక మ్యాచ్ అనంతరం రోహిత్ మాట్లాడుతూ.. తాము ప్రణాళికల ప్రకారం బౌలింగ్ చేయలేకపోయామని చెప్పాడు.
రోహిత్ శర్మకు భారీ జరిమానా!
March 28, 2022
0