దేశంలో కొత్తగా 1,270 కరోనా కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో కరోనా వైరస్ ప్రభావం దాదాపుగా తగ్గింది. గత వారం రోజుల నుంచి 1500లకు పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో మాత్రం పాజిటివ్ కేసులు అత్యల్పంగా నమోదయ్యాయి. కొత్తగా 1,270 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 15,859 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా నుంచి మరో 1,567 మంది కోలుకున్నారు. దేశంలో ఇప్పటి వరకు 183.26 కోట్ల టీకాలను పంపిణీ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)