వచ్చే రెండు రోజుల్లో తెలంగాణలో వేడి గాలులు వీస్తాయని భారత వాతావారణ శాఖ ఐఎండీ సూచించింది. తెలంగాణ సహా రాజస్థాన్, జమ్మూకశ్మీర్, హిమాచల్ప్రదేశ్, గుజరాత్, మధ్య ప్రదేశ్, ఒడిశా లో వేడి గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. గత మూడు రోజులుగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో వేడి గాలులు వీస్తున్నాయి. మరో రెండు రోజుల్లో ఈ ఎఫెక్ట్ ఇంకా ఎక్కువ ఉంటుందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహపాత్ర తెలిపారు. మూడు రోజులుగా మధ్య భారతదేశంలోని దక్షిణ రాజస్థాన్, సౌరాష్ట్ర, కచ్, కొంకణ్ ప్రాంతాల్లో వేడిగాలులు వీస్తున్నాయి. మధ్యభాగంలో గుజరాత్-రాజస్థాన్, ఒడిశా వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగానే ఉన్నాయి. అయితే గురువారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుతాయని అంచనా వేస్తున్నట్లు ఐఎండీ తెలిపింది.
రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో వేడి గాలులు
March 16, 2022
0
Tags