రోడ్డు ప్రమాదంలో పది మందికి గాయాలు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా నందవరం మండలంలోని హాలహర్వి సమీపంలో సోమవారం రెండు జీపులు ఢీకొన్న ప్రమాదంలో కర్ణాటక ప్రాంతం బాగల్‌కోటకు చెందిన పదిమంది గాయపడ్డారు. బాధితులు మంత్రాలయంలో దర్శనం ముగించుకుని శ్రీశైలానికి వెళ్తుండగా ముందుగా వెళ్తున్న జీపును మరో జీపు వేగంగా దాటుతూ ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో ఓ వాహనం బోల్తా పడగా, మరో వాహనం రహదారి పక్కన ఒరిగిపోయింది. క్షతగాత్రులను చికిత్స కోసం ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నలుగురికి తీవ్ర గాయాలవడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)