జార్ఖండ్కు చెందిన కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యే అంబా ప్రసాద్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు గుర్రంపై స్వారీ చేస్తూ అసెంబ్లీకి వచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో ఆమె గుర్రం స్వారీ చేయటంపై ఏమన్నా విశేషం ఉందా? అని ఆమెను మీడియా ప్రశ్నించగా ప్రతి మహిళలోనూ ఒక దుర్గా, ఒక ఝాన్సీరాణీ ఉంది' అని ఆమె అన్నారు. ధైర్యంతో మహిళలు ప్రతి సవాల్ను ఎదుర్కోవాలని ఆమె ఈ సందర్భంగా మహిళలకు సూచించారు. ప్రతి రంగంలోనూ మహిళలు రాణిస్తున్నారని, పేరెంట్స్ తమ ఆడపిల్లలను చదవించాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు.
గుర్రంపై స్వారీ చేస్తూ అసెంబ్లీకి....!
March 08, 2022
0
Tags