కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారులపై టోల్గేట్ల వద్ద పెంచిన చార్జీలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఉన్న పంతంగి, కొర్లపాడ్, చిల్లకల్లు టోల్గేట్ల వద్ద వసూలు చేయనున్న కొత్త చార్జీల వివరాలను జీఎమ్మార్ సంస్థ విడుదల చేసింది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే కారు, జీపులు మూడు టోల్గేట్ల వద్ద కలిపి రూ.310 చెల్లించుకోవాల్సి ఉంటుంది.