నాలుగు రోజుల్లో 100 కోట్లు

Telugu Lo Computer
0


కన్నడ పవర్ స్టార్ దివంగత పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం "జేమ్స్" మార్చి 17, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రముఖ తెలుగు సీనియర్ హీరో శ్రీకాంత్ మేక విలన్‌గా నటిస్తున్నారు. చేతన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరో సరసన ప్రియా ఆనంద్.ఈ సినిమా అప్పు అభిమానులను, ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా కర్ణాటకలో రికార్డు కలెక్షన్లతో దూసుకుని పోతుంది.  చిత్రాన్ని కిషోర్ పత్తికొండ నిర్మించారు. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్‌ను నటుడు శ్రీకాంత్ అండ్ విజయ్ ఎం సమర్పిస్తున్నారు. ఈ చిత్రం కర్ణాటకలో 400 థియేటర్లలో విడుదలైంది.  ప్రపంచవ్యాప్తంగా 4000 షోలను నమోదు చేసింది. తాజా రిపోర్ట్స్ ప్రకారం,'జేమ్స్' మూవీ వరల్డ్‌వైడ్ బాక్స్ఆఫీస్ వద్ద 4రోజుల్లో 100కోట్లు వసూలు చేసింది. మూవీ మేకర్స్ ట్విట్టర్ లో పోస్టర్ ని రిలీజ్ చేసి ఈ విషయాన్ని ప్రకటించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)