త్వరలో అండమాన్ నికోబార్లో జరగనున్న మునిసిపల్, పంచాయతీ ఎన్నికల కోసం టీడీపీ, కాంగ్రెస్ చేతులు కలిపాయి. ఈ ఎన్నికల్లో ఇరు పార్టీలు కలిసి బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యాయి. ఏఎన్టీసీసీ అధ్యక్షుడు రంగలాల్ హల్దార్, టీడీపీ స్థానిక అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్ బుధవారం పోర్టు బ్లెయిర్లో గాంధీ భవన్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. పొత్తులో భాగంగా పోర్టు బ్లెయిర్ మునిసిపాలిటీలోని 2, 5, 16 వార్డుల్లో టీడీపీ పోటీ చేస్తుంది. మార్చి 6న పోలింగ్ జరగనుండగా, 8న ఫలితాలు వెల్లడి కానున్నాయి. సమావేశం అనంతరం రంగలాల్ హల్దార్ మాట్లాడుతూ.. పోర్టుబ్లెయిర్ అభివృద్ధి, ప్రజాస్వామ్యయుత పాలన కోసం టీడీపీతో కలిసి బరిలోకి దిగాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఎన్నికల్లో గెలుపుపై హల్దార్ ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ తో చేతులు కలిపిన కాంగ్రెస్
February 04, 2022
0
Tags