ఆన్ లైన్ క్లాసులు ఆపొద్దు !

Telugu Lo Computer
0


తెలంగాణలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి పాఠశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్నా వ్యాధి తీవ్రత తక్కువగా ఉండటంతో వైద్య ఆరోగ్యశాఖ సూచనలతో విద్యాశాఖ ప్రత్యక్ష బోధనకు అనుమతి ఇచ్చింది. అయితే విద్యార్థులను పాఠశాలలకు పంపే నిర్ణయాన్ని తల్లిదండ్రులకు విడిచిపెట్టింది. తాజా విద్యాసంస్థల్లో బోధనపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యాసంస్థల్లో ఆన్ లైన్ బోధన కొనసాగించాలని ఆదేశించింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ఈనెల 20వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్ లైన్ బోధన కూడా కొనసాగించాలని తెలిపింది. అంతేకాదు హైదరాబాద్ నగరంలోని మార్కెట్లు, బార్లు, రెస్టారెంట్ల వద్ద కోవిడ్ నిబంధనలు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)