అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతుందనే ఒత్తిడిలో కేసీఆర్

Telugu Lo Computer
0


తెలంగాణలో వచ్చే జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని ఒత్తిడిలో కేసీఆర్ ఉన్నారని అందుకే వరుసగా ప్రెస్ మీట్ లు పెడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ అన్నారు. ప్రధాని మోడీని విమర్శిస్తే ప్రజాధారణ పెరుగుతుందని అనుకుంటున్నారని అన్నారు. కొద్ది రోజులుగా కేసీఆర్ వరుస మీటింగ్ లలో ప్రధాని మోడీ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారని, ఈ వ్యాఖ్యలు క్షమించరానివని అన్నారు. రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడిన సీఎం కేసీఆర్ రాజద్రోహం కేసు నమోదు చేయాలని బీజేపీ నేత డికే అరుణ డిమాండ్ చేశారు. కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోవడం ఖాయమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పదవి ఊడుతుందని భయం కేసీఆర్ కు పట్టుకుందని అన్నారు. దీంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురి అయి.. ఏం మాట్లాడుతున్నారో కేసీఆర్ కు కూడా అర్థం కావడం లేదని అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)