జైలులో ఖైదీ ఆత్మహత్య !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా జి.మడుగుల మండలం రాళ్లపుట్టు గ్రామానికి చెందిన రాధాకృష్ణ కుమారుడు ప్రవీణ్‌ కుమార్‌ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే గతేడాది జూలైలో తిరుపతిలో గంజాయి అక్రమ రవాణా చేస్తుండగా తిరుపతి యూనివర్సిటీ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో తిరుపతి జైలులో ఉన్న అతడిని అదే నెలలో చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు. ఇటీవల ప్రవీణ్ కుమార్‌కు బెయిల్‌ కోసం కుటుంబ సభ్యులు ప్రయత్నించగా రద్దయినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులు పట్టించుకోవడంలేదంటూ ప్రవీణ్ కుమార్ మనస్తాపానికి గురయ్యాడు. ఇదే విషయంపై పలుమార్లు తోటి ఖైదీలతో చెప్పి బాధపడ్డాడని జైలు అధికారులు వెల్లడించారు. బుధవారం మధ్యాహ్న సమయంలో బాత్‌రూమ్‌కు వెళ్లిన ప్రవీణ్ కుమార్.. బయటకు రాలేదు. కొంతసేపటి తర్వాత చూడగా కిటీకికి వెలాడుతూ కనిపించాడు. వెంటనే ప్రవీణ్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడని జైలు అధికారులు తెలిపారు. జైలు అధికారుల ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)