హైదరాబాద్ శివారు ప్రాంతాలు కల్తీ దందాలకు కేరాఫ్గా మారుతున్నాయి. కల్తీ మాఫియా నకిలీ ఐటెమ్స్ను తయారు చేసి సిటీలో సప్లయ్ చేస్తోంది. వంట నూనెలు, హెయిర్ ఆయిల్స్, షాంపులు, టీ పౌడర్, వాటర్ బాటిల్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్ సహా దేన్నీ వదలడం లేదు. బ్రాండెడ్ స్టిక్కర్స్ అంటించి హోల్సేల్ మార్కెట్కి సప్లయ్ చేసి అక్కడి నుంచి రిటైల్మార్కెటింగ్కి డంప్ చేస్తోంది. ఇలా ఏటా సుమారు రూ.150 కోట్లు విలువ చేసే కల్తీ, ఫేక్ ఐటమ్స్ సేల్స్ జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. హోల్సేల్ మార్కెట్లకి గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక నుంచి డూప్లికేట్ మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నట్లు చెప్తున్నారు. కల్తీ దందా చేసే వాళ్లు యూజ్ చేసిన బ్రాండెడ్ కంపెనీల మెటీరియల్ రీ సైక్లింగ్ చేస్తున్నారు. ఒరిజినల్ కంపెనీకి ఏ మాత్రం తేడా లేకుండా ప్యాకింగ్ చేస్తున్నారు. కస్టమర్లు గుర్తించేందుకు వీలు లేకుండా డిజిటల్ ప్రింటింగ్ చేస్తున్నారు. ఒరిజినల్ గూడ్స్ కంటే ఎక్కువ అట్రాక్ట్ గా ఉండేలా తయారు చేస్తున్నారు. పామాయిల్, నాసిరకం ఆయిల్ తయారు చేసి బ్రాండెడ్ ప్యాకింగ్ వేస్తున్నారు. ఇలాంటి డూప్లికెట్స్ను సిటీలోని హోల్సేల్ మార్కెట్స్కి సప్లయ్ చేస్తున్నారు. కల్తీ వస్తువులను గుర్తిస్తే సమాచారం అందించాలని పోలీసులు చెప్తున్నారు. బ్రాండెడ్ కంపెనీల ఫేక్ లేబుల్స్ తో టీ ప్యాకెట్ల తయారీ కేంద్రంపై మల్కాజిగిరి ఎస్ వోటీ, నాచారం పోలీసులు బుధవారం దాడులు చేసి ఒకరిని అరెస్ట్ చేశారు. ఉప్పల్ లోని గణేశ్ నగర్ కి చెందిన గుంటి జితేందర్ (42) నాలుగు నెలల కిందట మల్లాపూర్ గ్రీన్హిల్స్కాలనీలో ఒక ఇంటిని రెంట్ కి తీసుకున్నాడు. బేగంబజార్లో విడిగా టీ పౌడర్ ను కొని ఫేక్ రెడ్ లేబుల్, త్రీ రోజెస్, తులసీ బ్రాంక్ ప్యాకింగ్ కవర్లలో ప్యాక్ చేసి ఒరిజనల్ అంటూ నమ్మించి అమ్మేవాడు. అతని దందాపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మల్కాజిరిగి ఎస్ వోటీ, నాచారం పోలీసులు గ్రీన్ హిల్స్ కాలనీలోని తయారీ కేంద్రంపై దాడి చేసి జితేందర్ను అదుపులోకి తీసుకున్నారు. పౌచ్, సీలింగ్, వెయింగ్ మెషీన్, 20 కిలోల టీ పొడి, బ్రాండెడ్ కంపెనీల పేరుతో ఫేక్ లేబుల్స్ ను, 360 టీ బ్యాగ్ లు, కవర్ బండిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.4 లక్షల 25 వేలు ఉంటుందని ఇన్ స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. నిందితుడిని రిమాండ్ కి తరలించామన్నారు.
నకిలీ టీ ప్యాకెట్ల తయారీ కేంద్రంపై పోలీసుల దాడి
February 24, 2022
0
Tags