అన్నవరంలో భక్తుల తిప్పలు!

Telugu Lo Computer
0


అన్నవరం ఆలయ ప్రాంగణాలు కిటకిటలాడాయి. వందల సంఖ్యలో వివాహాలు జరగడం, మరోవైపు శనివారం భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామి దర్శనానికి ముందుగానే కొండపైకి చేరుకున్న భక్తులతో రద్దీ నెలకుంది. వసతి గదులకు డిమాండ్‌ ఏర్పడింది. గదులు దొరక్క అనేక మంది చలిలో ఆలయ ప్రాంగణంలోనే నిద్రించారు. ఆలయ ప్రాంగణంలో వార్షిక కల్యాణ వేదిక వద్ద షెడ్డులో అనేక వివాహాలకు మండపాలు వేయడంతో షెడ్డులో భక్తులు పడుకోవడానికి సరిపడా స్థలం లేక ఇబ్బంది పడ్డారు. రద్దీ సమయాల్లో షెడ్డులో వివాహాలకు అనుమతి ఇవ్వకుండా అధికారులు చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)