ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గంజాయిని భారీ స్థాయిలో దహనం చేయనుంది. పెద్ద మొత్తంలో గంజాయిని దహనం చేయడం దేశ చరిత్రలోనే తొలిసారి. గంజాయి నిర్మూలనకు ఏపీ పోలీస్ శాఖ ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్లో భాగంగా గంజాయి సాగుపై జగన్ సర్కారు ఉక్కుపాదం మోపింది. రాష్ట్రంలోని వివిధ శాఖల సమన్వయంతో పాటు సరిహద్దు రాష్ట్రాల సహాయ సహకారాలతో భారీ స్థాయిలో గంజాయి తోటలను ధ్వంసం చేసింది.
భారీగా గంజాయి దహనం!
February 12, 2022
0