మండపంలోనే కుప్పకూలిన వధువు!

Telugu Lo Computer
0


కర్ణాటక లోని కోలార్‌కు చెందిన చైత్ర (26) అనే యువతికి ఆమె తల్లిదండ్రులు  పెళ్లి నిశ్చయించారు. ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే శుక్రవారం బంధుమిత్రులు, సన్నిహితులు పెళ్లి మండపానికి చేరుకున్నారు. అంతా సంతోషంగా సాగిపోతుండగా వరుడితో కలిసి చైత్ర ఫోటోలకు ఫోజులిస్తూనే అకస్మాత్తుగా పెళ్లి మండపంలో కుప్పకూలిపోయింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. చైత్రను ఆమె తల్లిదండ్రులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఆమెను పరీక్షించిన వైద్యులు.. చైత్రకు బ్రెయిన్ డెడ్ అయినట్టు నిర్ధారించారు. దీంతో ఆమె తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అనంతరం ఆ తల్లిదండ్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కూతురి అవయవాలను దానం చేయాలని డిసైడ్ అయ్యారు. అంతేకాకుండా అందుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)