చెంగిచెర్లలో వెయ్యి ఎకరాల అడవి దత్తత

Telugu Lo Computer
0


తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా . చెంగిచెర్ల లో ఉన్నటువంటి వెయ్యి ఎకరాల అడవిని అక్కినేని నాగార్జున దత్తత తీసుకున్నారు. తన తండ్రి పేరుతో అక్కినేని అర్బన్ ఫారెస్ట్ పార్క్ శంకుస్థాపన చేసేందుకు సిద్ధమయ్యారు. గతంలో బిగ్ బాస్ 5 గ్రాండ్ ఫినాలే లో తాను వెయ్యి ఎకరాల అడవిని దత్తత తీసుకుంటానని అక్కినేని నాగార్జున చెప్పిన సంగతి తెలిసిందే.ఇది ఇలా ఉండగా పార్లమెంటు సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ కీలక నేత జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అద్భుతంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)