'ఈటీ ' టీజర్ రిలీజ్

Telugu Lo Computer
0


ఈటీ మూవీ తో సూర్య మార్చి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని పాండురాజ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఈటీ తెలుగు టీజర్ ను రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు. ఒక్క నిమిషం ఏడు సెకండ్ల నిడివిగల ఈ టీజర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. హీరోయిన్, విలన్ లను ఒక్కో ఫ్రేమ్ లో టీజర్ లో చూపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో సూర్య మాస్ అవతార్ ను ఎలివేట్ చేశారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమాలో సూర్య జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ కనిపించనుంది. వినయ్ రాయ్ విలన్ గా కనిపించనున్నారు. అలాగే సత్యరాజ్, రాజ్ కిరణ్, శరణ్య లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)