మిర్యాలగూడ లో ఒకే రోజు ఇద్దరు మహిళల ఆత్మహత్య
February 01, 2022
0
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఒకే రోజు ఇద్దరు మహిళలు వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. పట్టణంలోని దుర్గానగర్కు చెందిన లావణ్య అనే మహిళ సోమవారం ఇంట్లో చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అలాగే చైతన్యనగర్కు చెందిన లల్లి (30) అనే మహిళ ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఇద్దరి ఆత్మహత్యలపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.