ఆర్థిక మంత్రి సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. నేటి బడ్జెట్లో పలు కీలక ప్రకటనలు చేశారు. నిర్మలమ్మ పొద్దు తర్వాత.. కొన్ని వస్తువుల ధరలు పెరగ్గా, మరికొన్ని తగ్గాయి.
ధరలు తగ్గిన వస్తువులు: విదేశీ యంత్రాలు, వస్త్రాలు, తోలు వస్తువులు, వ్యవసాయ పరికరాలు, మొబైల్ ఛార్జర్లు, చెప్పులు, బూట్లు, వజ్రాల నగలు, ప్యాకేజింగ్ పెట్టెలు, రత్నాల ఆభరణాలు
పెరిగిన వస్తువులు: గొడుగులు, మూలధన వస్తువులు, కలపని ఇంధనం, రోల్డ్ గోల్డ్ ఆభరణాలు. బడ్జెట్లో ప్రభుత్వం రత్నాలు, ఆభరణాలపై కస్టమ్ డ్యూటీని తగ్గించింది. కస్టమ్ డ్యూటీని 5 శాతం తగ్గించి, కట్, పాలిష్ చేసిన వజ్రాలపై కూడా కస్టమ్ డ్యూటీని ప్రభుత్వం 5శాతం తగ్గించింది. దీంతో వాటి ధరలు బాగా తగ్గే అవకాశం కనిపిస్తోంది.